Wednesday, 16 September 2026 12:41:32 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి

పులకరించిన తంబళ్లపల్లె రైతాంగం-సీఎం చంద్రబాబుకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాం

Date : 15 September 2026 10:59 PM Views : 7

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె/పీటీఎం - సెప్టెంబర్ 15 : తంబళ్లపల్లె రైతాంగం దశాబ్దాల కల నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో హంద్రీనీవా జలాలు కరువు నేల తంబళ్లపల్లె ప్రాంతానికి తరలి రావడంతో తంబళ్లపల్లె రైతాంగం ఇది కల నిజమా అని చమర్చిన కళ్ళతో పులకరించిపోయింది. మంగళవారం హంద్రీనీవా జలాలు సత్యసాయి జిల్లా నుండి అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం సదుం క్రాస్ వద్దకు చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ అశేష జనవాహినితో మేళ తాళాలు, మంగళ వాయిద్యాలుతో అక్కడకు చేరుకొని సాంప్రదాయబద్ధంగా హంద్రీనీవా జలాలకు భక్తిశ్రద్ధలతో జలహారతి సమర్పించారు. హంద్రీనీవా జలాలకు శాస్రోత్తకంగా పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు, సారే సమర్పణ, పూలతో అభిషేకం, అఖండ జల హారతి అశేష జన వాహిని జయ జయ ద్వానాల మధ్య మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ జలహారతి నిర్వహించారు. ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ కరువు ప్రాంతమైన తంబళ్లపల్లెకు భవిష్యత్తులో సాగు-తాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దేనని చెప్పడంతో జనాలు ఈలలు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. గత వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలు గ్రాఫిక్స్ లో చూపించి ప్రజలను పచ్చిమోసం చేసిందని నేటి మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు కృషితో కరువు ప్రాంతానికి గంగమ్మ తల్లి తరలి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు, జనాల గుండెల్లో అపర భగీరధుడుగా నిలిచాడని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. కరువుతో అల్లాడుతున్న తంబళ్లపల్లె రైతాంగానికి, ప్రజలకు ప్రతి చెరువును హంద్రీనీవా జలాలతో నింపి సాగునీరుతోపాటు తాగునీరు అందించేంతవరకు విశ్రమించనని శపథం చేశారు. తంబళ్లపల్లె ను వైకాపా నాయకులు అన్ని రకాలుగా నిలువునా దోచుకున్నారు తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయ డంఖా మోగించడం ఖాయమని ధీమాగా చెప్పారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలు హంద్రీ నీవా జలాలను ఆస్వాదించి జయహో చంద్రబాబు నాయుడు, జి శంకర్ యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ జల హారతి కార్యక్రమానికి ఆరు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు, కూలీలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తంబళ్లపల్లె నుండి స్వచ్ఛందంగా చలో జలహారతి ః తంబళ్లపల్లె మండలం నుండి టిడిపి నాయకులతో పాటు రైతులు స్వచ్ఛందంగా వాహనాల్లో సదుం జల హారతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, పురుషోత్తం, ఎర్రసానిపల్లి సుధాకర్, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి, తెలుగు యువత గంగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు, కొటాల అల్లావుద్దీన్, బాలకృష్ణారెడ్డి, కొట్టాల సుధాకర,ఐసుల కృష్ణ, నాయకులు, కూటమి నాయకులు, రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :