నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 22 : ఆత్మకూరు నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ (తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా ఆత్మకూరు మండలం బోయల చిరువెళ్ళ గ్రామానికి చెందిన తెలుగుదేశం యువ నేత షేక్ హుస్సేన్ ఆలీని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియమించారు. తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధతతో పనిచేసిన వీరి కుటుంబం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్ల విధేయతగా పనిచేసిన హుస్సేన్ కు సముచిత స్థానం లభించిందని స్థానికులు పార్టీ నేతలు తెలుపుతున్నారు.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అలాగే తమ పార్టీ రూరల్, ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం నేతల సహకారంతో తనకు అందించిన పదవిని బాధ్యతగా పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని టిఎన్ఎస్ఎఫ్ నేతగా ఎన్నికైన షేక్ హుస్సేన్ ఆలీ తెలిపారు
Reporter
Namitha News