నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 09 :: తంబళ్లపల్లె మండలం లో టిడిపి నాయకులు ఐకమత్యంతో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఉత్తేజపరిచారు. మంగళవారం కుక్క రాజు పల్లెలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బాబ్ జాన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో టిడిపి కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబు గత ఎన్నికలలో పోలింగ్ బూతులలో ఓటింగ్ శాతంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె టిడిపికి కంచుకోటని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినాc- నైతిక విజయం కూటమిదేనని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధివైపు నడుస్తున్నట్లు చెప్పారు. ఏపీఐఐసీ కుక్క రాజు పల్లె కు రావడం స్థానిక ప్రజల అదృష్టమని టీడీపీ అభివృద్ధికి ఏపీఐఐసీ ఓ నిదర్శనమని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, కూటమి నాయకుల ఐకమత్యంతో ఘన విజయం సాధించి వైకాపాను మట్టి కరిపించాలన్నారు. తొలుత శ్రీరామ్ చినబాబును టిడిపి నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మండెం ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాబ్ జాన్,మదనమోహన్, శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరాములు, ఆదినారాయణ రెడ్డి, ఖాదర్ బాషా, కోటకొండ రాజేష్, చిన్న రెడ్డప్ప, క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, ప్రతాప్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి గంగిరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడు శంకర్ రెడ్డి చంద్రశేఖర్ నాయుడు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News