Sunday, 13 September 2026 03:48:49 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి

కూటమి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలం - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి హర్షం

Date : 01 September 2026 05:48 PM Views : 61

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి - కూటమి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలం - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి హర్షం : సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందని,కూటమి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలం మారిందని తెలుగుదేశం పార్టీ యువనేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.మంగళవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు 14వ వార్డు పరిధిలోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నాడు స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి,అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలిచారన్నారు.అదే స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.ప్రతి నెల ఒకటో తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తూ వృద్ధులు,దివ్యాంగులు,వితంతువులు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారన్నారు.సీఎం అనుభవం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతోందన్నారు.ఇక ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని త్వరలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :