Saturday, 12 September 2026 04:30:54 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

రోడ్డు ప్రమాదం కాదు... పక్కా ప్లాన్‌ ప్రకారమే హత్య...?

హిట్ & రన్ కాదు, మర్డర్

Date : 08 August 2026 11:08 AM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - ఆగస్ట్ 08 : అన్నమయ్య జిల్లా పీలేరు జగనన్న కాలనీ సమీపంలో నేషనల్ హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ కేసు విచారణలో దిమ్మతిరిగే షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో మృతుడి ఆచూకీ లభ్యమైంది. మృతుడిని పీలేరు డిష్ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యంగా పోలీసులు అధికారికంగా గుర్తించారు. హిట్ అండ్ రన్ కాదు... మర్డర్ ప్లాన్! తొలుత ఇది రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుబ్రహ్మణ్యాన్ని వేరే ప్రాంతంలో హత్య చేసి, ఆపై నేషనల్ హైవేపై పడేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పక్కా పథకం ప్రకారమే హత్య చేసి, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నేరస్థులు యత్నించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులపైనే అనుమానపు నీడలు! ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల తీరుపైనే పోలీసులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సుబ్రహ్మణ్యం భార్య, పిల్లలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సొంత కుటుంబ సభ్యులే హత్య చేసి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యాక్సిడెంట్‌గా చిత్రీకరించారా? అసలు ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలు ఏంటి? కుటుంబంలో ఉన్న వివాదాలేమైనా దీనికి కారణమా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయితే కానీ ఈ దారుణ హత్య వెనుక ఉన్న పూర్తి నిజాలు, అసలు సూత్రధారులు ఎవరనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :