నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 25 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముద్దుకృష్ణ, ఎంఈఓ త్యాగరాజు, కిషోర్, ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, ఎస్టి గురుకుల పాఠశాలల విద్యార్థులు క్రాస్ రోడ్డు నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటుతో మీ భవిష్యత్తు మార్చుకో, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి ఇంకా పలు రకాల నినాదాల ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి క్రాస్ రోడ్ లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజనులను రెవెన్యూ అధికారులు ఘనంగా సత్కరించారు. ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదై ఓటును సద్విని చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోర్డు ప్రతినిధి ఆవుల నర్సింహులు, అధ్యాపకులు, ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News