Wednesday, 29 July 2026 09:21:12 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి వాటి పైన చర్యలు తీసుకోవాలి

బీసీవై పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు గారికి వినతి

Date : 19 May 2026 04:59 PM Views : 143

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అనంతపురం - అనంతపురం నగరంలో శ్రీ చైతన్య పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని బీసీవై పార్టీ విద్యార్థి విభాగం అధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ సురేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్నిబంధనలకు విరుద్ధంగా కాసులకు కక్కుర్తి పడి అనంతపురం నగరంలో శ్రీ చైతన్య విద్యాసంస్థలు జిల్లా విద్యాశాఖ అధికారులను బురిడీ కొట్టిస్తూ నగరంలో ఉన్న పది బ్రాంచ్ లకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనుమతులు లేకపోయినా వాటికి అనుమతులు ఉన్నట్టు విద్యార్థులను చేర్చుకొని వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని తక్షణమే వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు,, వాటితోపాటు నగరంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలకు తరగతికి ఒక సెక్షన్కు అనుమతి తీసుకుని ఒక విద్యాసంస్థలలో మూడు నాలుగు సెక్షన్లు నిర్వహిస్తామన్నారు వాటిపైన జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ జరిపించాలని కోరారు. పామ్ రైట్ సి బి ఎస్ సి పాఠశాలకు ఒకటి రెండు మూడు తరగతులకు విద్యార్థులు లేకపోయినప్పటికీ రాష్ట్ర విద్యాశాఖకు సీబీఎస్సీ బోర్డుకు దొంగ పేర్లు చూపించి అనుమతి తీసుకువచ్చారు సీబీఎస్ఈ బోర్డును రాష్ట్ర విద్యాశాఖ అధికారులను మోసం చేయడం జరిగిందని మండిపడ్డారు దానితోపాటు తొమ్మిది పది తరగతులకు అనుమతులు లేకపోయినా విద్యార్థులను చేర్పించుకొని కర్నూల్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు అని ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆదిమూర్తి నగర్ లో ఉన్న బ్రాంచ్ మరియు రుద్రంపేటలో ఉన్న బ్రాంచ్ కు 5 6 7 8 9 తరగతులకు అనుమతులు లేకపోయినా వాటిని నిర్వహిస్తా ఉన్నారని తక్షణమే వాటిపైన విచారణ జరిపించాలన్నారు వాటితో పాటు విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలను వేళ్ల రూపాయలకు ఆన్లైన్ లో జొమాటో స్వీకీ రూపలలో తల్లితండ్రుల ఇళ్లకు డెలివరీ చేస్తూ ఆ డెలివరీ కాస్ట్ ను కూడా విద్యార్థుల తల్లిదండ్రులపై మోపుతున్నారని మండిపడ్డారు.. తక్షణమే అనంతపురం నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిసివై పార్టీ విద్యార్థి విభాగం నాయకులు రామాంజనేయులు గోవిందు రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :