నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు - టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ ప్రదానం మదనపల్లె : మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు వేస్తోందని ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా పేర్కొన్నారు.బి.కే.పల్లి ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరుకాగా ధాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ స్వాతి చక్రపాణి శాలువాతో సన్మానించి అపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాత్రి ఫౌండేషన్ మహిళలకు చేయూతనిస్తూ ఎంతోమంది మహిళల జీవితాలకు వెలుగునిస్తోందని కొనియాడారు.అంతేకాకుండా ఆనంద నిలయం పేరిట వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధుల అలనాపాలన చూస్తున్నారన్నారు.సేవా కార్యక్రమాలలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ధాత్రి ఫౌండేషన్ కి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం డాక్టర్ స్వాతి చక్రపాణి మాట్లాడుతూ తమ సంస్థలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఎమ్మెల్యే పెద్ద మనసుతో హాజరై మమ్ములను ఎంతో ఉత్తేజపరుస్తున్నారన్నారు.ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని కృషి చేస్తున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అని కొనియాడారు.తమ ఫౌండేషన్ సేవలను గుర్తించి స్థలం కేటాయిస్తామనడం ఆయన మంచితనానికి నిదర్శనమన్నారు.ఎమ్మెల్యే సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు.అనంతరం టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
Reporter
Namitha News