Wednesday, 29 July 2026 12:45:45 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు

Date : 17 April 2026 12:18 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 17 : ఆత్మకూరు ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీ ప్రభంజనం సృష్టించింది.. 45 వరకు రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకుల సాధించడం గొప్ప విశేషం.. ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరంలో వచ్చిన ఫలితాలలో జిల్లాలోని అత్యధిక ర్యాంకులు సాధించడం ఈ ఏడాది ప్రత్యేకత.. జిల్లా స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు రాష్ట్రస్థాయిలో ఐదు ర్యాంకులు సాధించి ఆత్మకూరు చరిత్రలోనే గొప్ప ప్రభంజనంగా ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది నిలవడం విశేషం.. ఈ క్రమంలో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.. తమ బిడ్డలకు మంచి విద్యను అందించి జిల్లా ర్యాంకులు సాధించడంలో సహకరించిన అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందన ధన్యవాదాలు తెలిపారు.. ప్రియదర్శిని కాలేజీలో తమకు అందించిన ఉత్తమ బోధనతోనే తాము మంచి ర్యాంకులతో పాస్ కావడానికి కారణమని అందుకు ఉపాధ్యాయులకు కాలేజ్ యాజమాన్యానికి రుణపడి ఉంటామని విద్యార్థులు తెలిపారు.. ఆత్మకూరు పట్టణంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించి అత్యధిక పాస్ శాతం పొందడం సంతోషంగా ఉందని కాలేజీ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు రెడ్డి మరియు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు తినిపించి బొకేతో సత్కరిస్తూ అభినందనలు తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 670 మంది విద్యార్థులతో అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిగిన కళాశాల తమదేనని గత ఏడాది రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకుతో పాటు ఈ ఏడాది మొదటి మూడు ర్యాంకులు మరియు అత్యధిక ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషకరమని తమ విద్యా బోధన క్రమశిక్షణతో తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును తమ చేతిలో పెడుతున్నారని అందుకే తాము తమ సిబ్బంది ఎంతో కృషిచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :