Wednesday, 29 July 2026 04:17:20 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ

ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ పాదయాత్రలను విజయవంతం చేయాలి

Date : 26 July 2026 09:00 AM Views : 52

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 25 : ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నీట్ పరీక్షల వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు, విద్యార్థుల ఆందోళనలో పోలీసులు లాఠీ చార్జి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, తంబళ్లపల్లె నియోజకవర్గ కార్యదర్శి మనోహర్ రెడ్డి తెలిపారు శనివారం బి కొత్తకోట లో సీపీఐ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 27న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాలు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే అన్నమయ్య జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతాంగం, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, తాగునీటి సమస్య తీవ్రమవడం వల్ల గ్రామీణ ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్నమయ్య జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి, రైతులకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ, రుణాల పునర్వ్యవస్థీకరణ, ఇన్‌పుట్ సబ్సిడీ, ఉపాధి హామీ పనులను విస్తృతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు

జిల్లాలో త్రాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, ప్రతి గ్రామానికి తక్షణమే తాగునీరు అందించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, చెడిపోయిన తాగునీటి పథకాలను వెంటనే మరమ్మతు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహించే పాదయాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరవు, తాగునీటి కొరత, రైతాంగ సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రజావ్యతిరేక విధానాలపై గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు

ఈ కార్యక్రమంలో సీపీఐ బి కొత్తకోట మండల కార్యదర్శి రఘునాథ్,పట్టణ కార్యదర్శి అష్రఫ్ అలీ, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు తంబయ్యశెట్టి,గంగులప్ప తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :