నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 12 ః అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశాల మేరకు తంబళ్లపల్లి మండలం మీట్లో వి బి జి రామ్ జి నూతన ఉపాధి చట్టం లో 125 రోజుల పని దినాల పెంపు బ్రోచర్ను ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఏపీఓ అంజనప్ప, ప్రత్యేక ఆహ్వానితుడు ఎరుకుల్ రెడ్డి ఆవిష్కరించారు. నూతన ఉపాధి హామీ చట్టంతో కూలీలకు పని దినాలు పెంపుతో పాటు నిరుద్యోగ భృతి, సకాలంలో వేతనాలు చెల్లింపు, భవిష్యత్తు ప్రణాళికలపై మండల సర్వసభ్య సమావేశంలో అవగాహన కల్పించారు.
Reporter
Namitha News