నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 10 ః టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా కష్టపడి చదవాలని స్పెషల్ ఆఫీసర్ డి ఎల్ డి ఓ అమరనాథరెడ్డి చేశారు. మంగళవారం ఆయన మోడల్ స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థుల అభ్యసనా స్థాయిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి ఉన్నత చదువులకు ఈ టెన్త్ క్లాస్ విజయ సోపానంగా నిలుస్తుందని ప్రతి విద్యార్థి పోటీ తత్వం పెంచుకొని పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలని సూచించారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులు వారి సందేహాలను దగ్గరుండి పరిష్కరించి టెన్త్ లో ప్రతి విద్యార్థి తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక భాధ్యత తీసుకోవాలని ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ కు సలహా ఇచ్చారు
Reporter
Namitha News