Monday, 08 June 2026 09:53:34 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం

Date : 13 April 2026 07:45 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 13 : మదనపల్లి సమీపం అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2కె26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఈ కార్యక్రమం కేవలం విజయోత్సవ సభ మాత్రమే కాకుండా విద్యార్థి నాయకత్వాన్ని గుర్తించే వేడుక అని అన్నారు . ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ నాయకత్వం, ప్రతిభ మరియు సామర్థ్యాన్ని చాటిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి ఒక నాయకుడిగా నిలిచారని, ప్రతి సవాలును ఒక అవకాశంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు ప్రతి రంగంలోనూ ఎదగాలని, ఐఐఎం బెంగళూరు, ఐఐటీ తిరుపతి వంటి సంస్థల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి, ప్లేస్‌మెంట్ టీమ్‌లు, స్పోర్ట్స్ టీమ్‌లు వంటి కార్యకలాపాల్లో రెండవ సంవత్సరం నుంచే చురుకుగా పాల్గొనాలని సూచించారు. మిట్స్ యూనివర్సిటీ అవసరమైన సహకారం, వనరులు అందించేందుకు సిద్ధంగా ఉందని, విద్యార్థులు ముందుకు వచ్చి నాయకత్వాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాయకులేనని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వారి సహకారంతో అందరిని ఉత్సాహపరచడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. టీమ్ స్పిరిట్ అనేది ప్రతి విద్యార్థిలోనూ ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని ఆయన అన్నారు. అలాగే మిట్స్ యూనివర్సిటీ నందు మ్యూజిక్ మరియు డ్యాన్స్ తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రకటిస్తూ, ఆసక్తి ఉన్నవారు తమ రెజ్యూమ్‌ను రిజిస్ట్రార్‌కు పంపాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ మార్చ్ 25 మరియు 26 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో మొదటి రోజు రాకాస మూవీ టీం బృందం కొణెదల నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, గెటప్ శీను, సింగర్స్ సాగర్, మౌనిక యాదవ్, లిప్శిక భాష్యం మరియు రెండవ రోజున హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్, జబర్దస్త్ టీం సద్దాం హుస్సేన్, బిందాస్ భాస్కర్ నవ సందీప్ మరియు జబర్దస్త్ పులి లు పాల్గొని విద్యార్థులను అలరింపజేశారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రసంశ పత్రాలను మరియు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం లో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకనాథ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా, కో-కన్వీనర్ వై ప్రదీప్ కుమార్, ప్రెసిడెంట్ హర్షవర్ధన్,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయరాం రెడ్డి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :