Tuesday, 15 September 2026 06:51:09 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం

Date : 13 April 2026 07:45 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 13 : మదనపల్లి సమీపం అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2కె26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఈ కార్యక్రమం కేవలం విజయోత్సవ సభ మాత్రమే కాకుండా విద్యార్థి నాయకత్వాన్ని గుర్తించే వేడుక అని అన్నారు . ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ నాయకత్వం, ప్రతిభ మరియు సామర్థ్యాన్ని చాటిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి ఒక నాయకుడిగా నిలిచారని, ప్రతి సవాలును ఒక అవకాశంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు ప్రతి రంగంలోనూ ఎదగాలని, ఐఐఎం బెంగళూరు, ఐఐటీ తిరుపతి వంటి సంస్థల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి, ప్లేస్‌మెంట్ టీమ్‌లు, స్పోర్ట్స్ టీమ్‌లు వంటి కార్యకలాపాల్లో రెండవ సంవత్సరం నుంచే చురుకుగా పాల్గొనాలని సూచించారు. మిట్స్ యూనివర్సిటీ అవసరమైన సహకారం, వనరులు అందించేందుకు సిద్ధంగా ఉందని, విద్యార్థులు ముందుకు వచ్చి నాయకత్వాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాయకులేనని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వారి సహకారంతో అందరిని ఉత్సాహపరచడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. టీమ్ స్పిరిట్ అనేది ప్రతి విద్యార్థిలోనూ ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని ఆయన అన్నారు. అలాగే మిట్స్ యూనివర్సిటీ నందు మ్యూజిక్ మరియు డ్యాన్స్ తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రకటిస్తూ, ఆసక్తి ఉన్నవారు తమ రెజ్యూమ్‌ను రిజిస్ట్రార్‌కు పంపాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ మార్చ్ 25 మరియు 26 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో మొదటి రోజు రాకాస మూవీ టీం బృందం కొణెదల నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, గెటప్ శీను, సింగర్స్ సాగర్, మౌనిక యాదవ్, లిప్శిక భాష్యం మరియు రెండవ రోజున హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్, జబర్దస్త్ టీం సద్దాం హుస్సేన్, బిందాస్ భాస్కర్ నవ సందీప్ మరియు జబర్దస్త్ పులి లు పాల్గొని విద్యార్థులను అలరింపజేశారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రసంశ పత్రాలను మరియు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం లో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకనాథ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా, కో-కన్వీనర్ వై ప్రదీప్ కుమార్, ప్రెసిడెంట్ హర్షవర్ధన్,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయరాం రెడ్డి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: