నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి - పీస్ కమిటీ సమావేశంలో డిఎస్పీ పావని సూచనలు - హాజరైన టిడిపి మైనార్టీ నాయకులు,ముస్లిం పెద్దలు మదనపల్లె : పవిత్ర బక్రీద్ పండుగ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మదనపల్లి డిఎస్పీ పావని సూచించారు.సోమవారం తన కార్యాలయంలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.హిందూ,ముస్లిం సోదరులు పరస్పర ఐకమత్యం,సౌభ్రాతృత్వం మరియు సమన్వయంతో పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె సూచించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్,ప్రభుత్వ సర్ ఖాజీ జామియా మసీద్ జలాలుద్దీన్,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),రూటా రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ మహమ్మద్ ఖాన్,పట్టణ సీఐలు మొహమ్మద్ రఫీ,రాజారెడ్డి,తాలూకా సిఐ కళా వెంకటరమణ,పలువురు ఎస్.ఐలు మత గురువులు,మత పెద్దలు,మసీదు కమిటీ సభ్యులు మరియు మదనపల్లి నియోజకవర్గానికి చెందిన హిందూ,ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సమాజంలో శాంతి,సామరస్యాలను కాపాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.మతసామరస్యానికి మదనపల్లి ప్రసిద్ధిగాంచిందని,ఇదే స్పూర్తిగా కొనసాగించాలని సూచించారు.
Reporter
Namitha News