Thursday, 30 July 2026 07:48:42 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గ్రామ సచివాలయ సేవలు పారదర్శకంగా, వేగంగా అందాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

నందిరెడ్డి గారిపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 02 April 2026 08:13 PM Views : 368

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 02: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం నందిరెడ్డి గారిపల్లె గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు విధానం, ప్రజల వినతులు–ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ సమయానికి విధులకు హాజరై ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. హాజరు వ్యవస్థ కచ్చితంగా అమలు చేస్తే సేవలలో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయన్నారు. సచివాలయ సేవలు ప్రజలకు సులభంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ప్రజల నుండి స్వీకరించిన వినతులు, ఫిర్యాదులను, అలాగే జిల్లా కేంద్రం నుండి పంపబడే వినతులు, వివిధ శాఖల సూచనలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామస్థుల సమస్యలను ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భూ రికార్డులు, ల్యాండ్ రిజిస్టర్లను కూడా పరిశీలించిన కలెక్టర్, అన్ని రికార్డులను సక్రమంగా నవీకరించి నిర్వహించాలని అధికారులకు సూచించారు. భూ వివరాలు స్పష్టంగా నమోదు చేయడం ద్వారా భూ వివాదాలు తగ్గి ప్రజలకు సులభంగా సేవలు అందుతాయని పేర్కొన్నారు. సచివాలయంలో అన్ని శాఖల వివరాలను డిజిటల్ విధానంలో నవీకరించడంతో పాటు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో పలు సూచనలు జారీ చేశారు

ఈ కార్యక్రమంలో తాసిల్దారు ధనుంజయులు, ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :