Tuesday, 15 September 2026 09:43:49 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

గ్రామ సచివాలయ సేవలు పారదర్శకంగా, వేగంగా అందాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

నందిరెడ్డి గారిపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 02 April 2026 08:13 PM Views : 431

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 02: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం నందిరెడ్డి గారిపల్లె గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు విధానం, ప్రజల వినతులు–ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ సమయానికి విధులకు హాజరై ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. హాజరు వ్యవస్థ కచ్చితంగా అమలు చేస్తే సేవలలో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయన్నారు. సచివాలయ సేవలు ప్రజలకు సులభంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ప్రజల నుండి స్వీకరించిన వినతులు, ఫిర్యాదులను, అలాగే జిల్లా కేంద్రం నుండి పంపబడే వినతులు, వివిధ శాఖల సూచనలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామస్థుల సమస్యలను ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భూ రికార్డులు, ల్యాండ్ రిజిస్టర్లను కూడా పరిశీలించిన కలెక్టర్, అన్ని రికార్డులను సక్రమంగా నవీకరించి నిర్వహించాలని అధికారులకు సూచించారు. భూ వివరాలు స్పష్టంగా నమోదు చేయడం ద్వారా భూ వివాదాలు తగ్గి ప్రజలకు సులభంగా సేవలు అందుతాయని పేర్కొన్నారు. సచివాలయంలో అన్ని శాఖల వివరాలను డిజిటల్ విధానంలో నవీకరించడంతో పాటు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో పలు సూచనలు జారీ చేశారు

ఈ కార్యక్రమంలో తాసిల్దారు ధనుంజయులు, ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: