Thursday, 16 April 2026 03:20:11 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

గ్రామ సచివాలయ సేవలు పారదర్శకంగా, వేగంగా అందాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

నందిరెడ్డి గారిపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 02 April 2026 08:13 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 02: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం నందిరెడ్డి గారిపల్లె గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు విధానం, ప్రజల వినతులు–ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ సమయానికి విధులకు హాజరై ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. హాజరు వ్యవస్థ కచ్చితంగా అమలు చేస్తే సేవలలో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయన్నారు. సచివాలయ సేవలు ప్రజలకు సులభంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ప్రజల నుండి స్వీకరించిన వినతులు, ఫిర్యాదులను, అలాగే జిల్లా కేంద్రం నుండి పంపబడే వినతులు, వివిధ శాఖల సూచనలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామస్థుల సమస్యలను ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భూ రికార్డులు, ల్యాండ్ రిజిస్టర్లను కూడా పరిశీలించిన కలెక్టర్, అన్ని రికార్డులను సక్రమంగా నవీకరించి నిర్వహించాలని అధికారులకు సూచించారు. భూ వివరాలు స్పష్టంగా నమోదు చేయడం ద్వారా భూ వివాదాలు తగ్గి ప్రజలకు సులభంగా సేవలు అందుతాయని పేర్కొన్నారు. సచివాలయంలో అన్ని శాఖల వివరాలను డిజిటల్ విధానంలో నవీకరించడంతో పాటు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో పలు సూచనలు జారీ చేశారు

ఈ కార్యక్రమంలో తాసిల్దారు ధనుంజయులు, ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :