నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 30 : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం ఎస్టియు ఉపాధ్యాయ సంఘం నాయకులు తాసిల్దార్ శ్రీనివాసులు కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్ దారులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని, 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి 30% మద్యం తర భృతి చెల్లించాలని, పెన్షన్ దారుల ఆర్థిక బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ అమలు చేయాలన్నారు, ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజు పెన్షన్ చెల్లించాలని, నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని ఇంకా పలు సమస్యలపై ఎస్ టి యు అధ్యక్షులు యాసనుల్లా, వెంకట నరసప్ప, రెడ్డప్ప రెడ్డి, రమేష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సాంబశివ, సత్యనారాయణ, సుధాకర్, మెహరీన్, సిని, రిత్విక సవేరి ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు
Reporter
Namitha News