నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 03 : ప్రజా వేదికలో తమ సమస్యలు మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ద్వారా పరిష్కరించుకోవాలని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మహిళా నాయకురాలు సిద్ధమ్మ, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి, బీసీ నాయకుడు పురుషోత్తం బాబులు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 4 శుక్రవారం పీటీఎం మండల కేంద్రం శ్రీ విజయ గణపతి కళ్యాణ మండపంలో నియోజకవర్గస్థాయి ప్రజావేదిక జరుగుతుందని ప్రజలు తమ సమస్యలు మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ కు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని వారు ఓ ప్రకటనలో కోరారు
Reporter
Namitha News