నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజకీయాలలో నిస్వార్ధమైన ప్రజాసేవకుడు కమ్మల రఘు అని టిడిపి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ప్రశంసించారు. బుధవారం టిడిపి యువ నాయకుడు కమ్మల రఘు పుట్టినరోజు వేడుకలు చంద్రాకాలనీలోని ఆయన స్వగృహంలో పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అనుచరుడిగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన రఘు కు శ్రీరామ్ చినబాబుతో పాటు పాలయేకరి సంఘం నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ దేవరింటి శ్రీనివాసులు, రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి మేకల రెడ్డిశేఖర్ మదనపల్లి నియోజకవర్గ ఐటిడిపి అధ్యక్షులు కాశీ శ్రీరామ్ వాల్మీకి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, తెలుగుయువత నాయకులు ప్రకాష్ నాయుడు, మైనారిటీ నాయకులు షేక్ సికిందర్ బాషా, తెలుగుదేశం సీనియర్ నాయకులు పసుపులేటి శ్రీనివాసులు,లైఫ్ కేర్ రాజశేఖర్, బంధుమిత్రులు,స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కమ్మల రఘు ను శాలువా, పూలమాలలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రఘు పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారన్నారు. అనతి కాలంలోనే యువ నాయకుడిగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కష్టమొస్తే క్షణం ఆలోచించకుండా వారికి అండగా నిలుస్తున్నాడని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. అందరిని చిరునవ్వుతో పలకరించే మనస్తత్వం, తనతోపాటు తన చుట్టూ ఉన్నవారు బాగుండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న కమ్మల రఘు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.ఆయన జన్మదిన వేడుకలలో పలువురు నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News