నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం - శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు మదనపల్లె : ఇటీవల పట్టణంలో మార్పూరి వీధిలోని శీనా టీస్టాల్ ఎదురుగా ఏర్పాటైన మదనపల్లి ప్రెస్ క్లబ్ నూతన ప్రధాన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇందులో మదనపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి,గౌరవ సలహాదారుగా సిరివేలు చరణ్ కుమార్,అధ్యక్షుడిగా నక్కింటి రవీంద్ర,కార్యదర్శిగా మోడెం శ్రీనివాసరావు,కోశాధికారిగా నానబాల కుమార్ లను ఎన్నుకున్నారు.ఇందుకు మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు అప్పినపల్లి భాస్కరాచారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మదనపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం తనను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు.పాత్రికేయ వృత్తి ఎంతో ఉన్నతమైందని సమాజంలో జరిగే పరిణామాలను ప్రజలకు వివరిస్తూ నిస్వార్ధమైన సేవలందించడంలో ముందుంటారని కొనియాడారు.సమిష్టి కృషితో మదనపల్లి ప్రెస్ క్లబ్ అభివృద్ధికి బాటలు వేద్దామని పిలుపునిచ్చారు.అనంతరం గౌరవ సలహాదారు సిరివేలు చరణ్ కుమార్ మాట్లాడుతూ మహోన్నత ఆశయం,సమాజానికి మంచి చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటైన మదనపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారుడిగా తనను నియమించడం ఆనందంగా ఉందన్నారు.మదనపల్లె ప్రెస్ క్లబ్ పాత్రికేయుల సంక్షేమం అభ్యున్నతికి తన సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు.పాత్రికేయ వృత్తిలో తనకు అనుభవం తక్కువే అయినప్పటికీ ఈ రంగంలో తనకు అందరూ సన్నిహితులేనన్నారు.సమాజంలోని సమస్యలను,లోటుపాట్లను నిర్భయంగా ప్రచురించి ప్రజల పక్షాన కలం గళం వినిపించాలని ఆయన సూచించారు.మదనపల్లి ప్రెస్ క్లబ్ దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.నూతన అధ్యక్ష,కార్యదర్శి,కోశాధికారులు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతగా నిర్వర్తిస్తామని,మదనపల్లి ప్రెస్ క్లబ్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని,పాత్రికేయుల సమస్యలపై పోరాటం చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడంలో మదనపల్లి ప్రెస్ క్లబ్ ను ముందు వరుసలో నిలుపుతామని వెల్లడించారు.తమకు ఈ అవకాశం కల్పించిన మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం సభ్యులు నూతన ప్రధాన కమిటీని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
Reporter
Namitha News