Thursday, 16 April 2026 03:20:11 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

పుంగనూరు గంగమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ

శక్తి టీమ్స్ , డ్రోన్లు , సీసీ కెమెరాల నిఘా తో చక్రవ్యూహం తో పటిష్టమైన బందోబస్తు మధ్య వేడుకలు

Date : 08 March 2026 03:31 PM Views : 345

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మార్చి 08 : పుంగనూరు పట్టణంలో ఈనెల 10, 11 తేదీ లలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర కు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేస్తోందని తెలిపిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఈరోజు పుంగనూరు లో బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు కు పలు సూచనలు చేసి, మీడియా ముఖంగా పలు కీలక సూచనలు చేశారు

జాతర జరిగే పరిసరాల్లో అదనపు సీసీ కెమెరాలతో పాటు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచడం జరుగుతుందొని, జాతర రద్దీని ఆసరాగా చేసుకుని పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలకు పాల్పడే ముఠాలను అరికట్టేందుకు అనుభవజ్ఞులైన క్రైమ్ పార్టీలను రప్పించాము. ఇప్పటికే 4 ప్రత్యేక క్రైమ్ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ట్రాఫిక్ మళ్ళింపులు మరియు పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాము. భక్తుల క్యూ లైన్లను క్రమబద్ధీకరించడానికి అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నాము. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని, ఈవ్ టీజర్లను అరికట్టడానికి ప్రత్యేకంగా శక్తి టీమ్స్ ను రంగంలోకి దించాము. ఆలయం సమీపం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. భక్తులకు ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరిన ఎస్పీ. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించి ఇప్పటికే రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, జాతర సమయంలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీస్ మరియు అబ్కారీ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తారని, భక్తులందరూ పోలీసులకు సహకరించి, జాతరను ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని విజ్ఞప్తి చేసిన ఎస్పీ

ఈ కార్యక్రమంలో పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐ అన్సర్ భాష మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :