నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మార్చి 08 : పుంగనూరు పట్టణంలో ఈనెల 10, 11 తేదీ లలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర కు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేస్తోందని తెలిపిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఈరోజు పుంగనూరు లో బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు కు పలు సూచనలు చేసి, మీడియా ముఖంగా పలు కీలక సూచనలు చేశారు
జాతర జరిగే పరిసరాల్లో అదనపు సీసీ కెమెరాలతో పాటు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచడం జరుగుతుందొని, జాతర రద్దీని ఆసరాగా చేసుకుని పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలకు పాల్పడే ముఠాలను అరికట్టేందుకు అనుభవజ్ఞులైన క్రైమ్ పార్టీలను రప్పించాము. ఇప్పటికే 4 ప్రత్యేక క్రైమ్ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ట్రాఫిక్ మళ్ళింపులు మరియు పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాము. భక్తుల క్యూ లైన్లను క్రమబద్ధీకరించడానికి అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నాము. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని, ఈవ్ టీజర్లను అరికట్టడానికి ప్రత్యేకంగా శక్తి టీమ్స్ ను రంగంలోకి దించాము. ఆలయం సమీపం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. భక్తులకు ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరిన ఎస్పీ. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించి ఇప్పటికే రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, జాతర సమయంలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీస్ మరియు అబ్కారీ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తారని, భక్తులందరూ పోలీసులకు సహకరించి, జాతరను ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని విజ్ఞప్తి చేసిన ఎస్పీ
ఈ కార్యక్రమంలో పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐ అన్సర్ భాష మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News