నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 28 : మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ కి చెందిన ఆరవ వాండ్ల పల్లి కి చెందిన దివాకర్ బెంగళూరు లో కూలీ పనులు చేసుకొని జీవనంచేసుకొనే క్రమంలో జనవరి 4న బెంగళూరు కు పని కి వెళుతున్నాను అని చెప్పి వెళ్లిన దివాకర్ మరుసటి రోజు నుండీ సెల్ ఫోన్ కు అందుబాటులోకి రాకపోవడం తో వారం రోజులు అయినా ఫోన్ రింగ్ కాలేదని పనిచేసేచోటు లో వాకబు చేసిన కుటుంబీకులు పనికి రాలేదని తెలుసుకొని ఎక్కడెక్కడో వెతికిన ఆచూకీ తెలియకపోవడం తో ఫిబ్రవరి 10న మదనపల్లి తాలూకా పోలీసులను ఆశ్రయించడం తో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు లో అనుమానితుని అదుపులోకి తీసుకోవడం తో వెలుగులోకి వచ్చిన హత్య ఉదతం. తాలూకా పోలీస్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు నిన్నటి దినం స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు బండక్రిందపల్లి కి వెళ్లే దారిలో హంద్రీనీవా కాలువ సమీపంలో సరిగా పూడ్చని మృతదేహం ఉందన్న సమాచారం తో ఘటనా స్థలానికి వెళ్లి రెవిన్యూ అధికారుల సమక్షంలో మృతదేహం ను వెలికితీయగా కుళ్ళిన స్థితి లో ఉండగా నేడు స్పాట్ పి.యం. నిర్వహించాం హత్య కేసుగా నమోదు చేసాం, ప్రాధమికంగా హత్య చేసి పూడ్చిపెట్టినట్లు గా ఉందని, హతుడు ఆరవ వాండ్ల పల్లి కి చెందిన కనబడకుండా పోయిన దివాకర్ గా గుర్తించాం, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపిన ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ
Admin
Namitha News