నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - మే15 : గుర్రంకొండ మండలం చెర్లోపల్లి కొండ పై వెలసి ఉన్న రెడ్డమ్మ తల్లి మూల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి . శక్తిక్షేత్రం గా విరాజిళ్లుతున్న రెడ్డెమ్మ కొండ రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి మన రాష్ట్రం నుండే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. బిడ్డలు లేని వారు ఇక్కడ మొక్కుబడులు చేస్తే పిల్లలు పుడతారానేది వారి ప్రగాఢ విశ్వాసం. ఆదివారం రోజులలో వేలాదిగా భక్తులు తరలివస్తారు . కోరిన కోరికలు తీరిన భక్తులు తలనిలాలుసమర్పిస్తారు. సంతానం కలిగిన వారు పుట్టు వెంట్రుకలు ఇస్తారు. హిందూవులు కాక ముస్లింలు కూడ సంతానం కలగాలని ఇక్కడ రావడం విశేషం. పరమత సహానినికి చిహ్నం గా విరాజిల్లుతున్న శక్తి క్షేత్రం . ఈ కార్యక్రమంకు వచ్చిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని పూల మాలలతో ఘన స్వాగతం పలికిన రాజంపేట పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షులు దద్దాల హరి ప్రసాద్ నాయుడు ప్రేమకు మారి,వై,విజయ్ దద్దాల శివ కుమార్ నోషాద్ అహ్మద్ నాయిని జగదీష్. సుంకర విజయ్.ఐ టీడీపీ రంజిత్ ఎండి జమీర్ పర్వేజ్ అహ్మద్ నక్క సతీష్ కొత్తపల్లి సుంకర శేఖర నల్లారి యువసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Namitha News