Thursday, 16 April 2026 03:05:02 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది - పర్వీన్ తాజ్

Date : 09 March 2026 08:41 AM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 08 : రాష్ట్ర మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ తెలిపారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఐకెపి ఏపిఎం గంగాధర్, సిడిపిఓ సుజాత ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర పాల ఏకిరి సంఘం అధ్యక్షుడు నాగేశ్వర నాయుడు మాట్లాడుతూ మహిళాభివృద్ధి కోసం మూడు దశాబ్దాల క్రితమే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా పొదుపు సంఘాలతో వారిలో చైతన్యం తెచ్చి నేడు సంఘాల బలోపేతమై లక్షాధికారులు కావడానికి దోహద పడినట్లు చెప్పారు. టిడిపి ప్రభుత్వంలోని మహిళలకు దీపం పథకంలో మూడు సిలిండర్లు ఉచితం, డ్వాక్రా సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు,శ్రీ శక్తి పథకంలో బసుల్లో ఉచిత ప్రయాణం తో పాటు ప్రతి పథకాన్ని మహిళల కేటాయించి వారి ఆదరణ పొందినట్లు చెప్పారు. జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుండి మహిళా సంక్షేమ ధ్యేయంగా టిడిపి నిలవడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషే కారణమన్నారు. టిడిపి మహిళా నాయకురాలు సిద్ధమ్మ మాట్లాడుతూ మహిళలు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో మహిళలు లక్షాధికారులుగా మారారని కొనియాడారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు. అనంతరం అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ సందర్శించి వారిని అభినందించారు.తొలుత నాగేశ్వర నాయుడు, పర్వీన్ తాజ్ లను స్థానిక టిడిపి నాయకులు ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐకెపి మండల సమాఖ్య అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, మహిళా సిసి ఆదిలక్ష్మి, వివో సభ్యులు, ఆరు మండలాల అంగన్వాడీ సూపర్వైజర్లు, మహిళా సంఘ సభ్యులు, టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :