నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 13 : తంబళ్లపల్లె మండలం లో గత వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కేసులకు ఎదురొడ్డి నిలిచి పార్టీకి కష్ట కాలంలో పనిచేసిన నాయకులకు న్యాయం చేయాలని మండలాలు టిడిపి సీనియర్ నాయకుడు ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశాడు. గురువారం అమరావతిలో మంత్రితో మర్యాదపూర్వకంగా కలిసి మండలంలో పార్టీ పరిస్థితి, సమస్యలపై పూర్తిగా వివరించారు. మంత్రి క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ నని కష్టకాలంలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తంబళ్లపల్లె నియోజకవర్గానికి ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని త్వరలో ఇన్చార్జిగా ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు వెంకట్రెడ్డి విలేకరులకు తెలిపారు.
Reporter
Namitha News