నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుల నిరసన.. అధికారులారా దళితులపై మీకు మేమంటే అంత చిన్న చూపా... దళితవాడలో సమస్యలు పరిష్కారానికి మోగ్గుచూపుని సంబంధిత అధికారులు.. పుంగనూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ అండ్ మానిటరింగ్ సభ్యులు,ఎంఆర్పిఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు అనగారిన కులాలకు అభివృద్ధి చేకూర్చాలని ఆశయంతో ప్రభుత్వం 27 శాఖలకు సంబంధించిన అధికారులతో ఎస్సీ,ఎస్టీ అండ్ మోనిటరింగ్ సమావేశాన్ని ప్రతినెల చివరణ నిర్వహించడం జరుగుతున్నదని అయితే గత నాలుగు నెలల నుండి సంబంధిత శాఖ అధికారులు సమావేశానికి గైహాజరు కావడం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్, తాసిల్దార్ పూర్తిస్థాయిలో అన్ని శాఖల అధికారులతో కలసి ఈ కార్యక్రమం నిర్వహిస్తేనే మా సమస్యలు పరిష్కరించడానికి వీలవుతుందని తెలియజేసిన గత నెలలో అధికారులు గైహాజరుకాగా ఇప్పుడు తాసిల్దారు ఆర్.ఐ. కూడా సమావేశానికి రాకపోవడం గమనార్హంగా ఉందని,ఇక రేపు నెలలో నిర్వహించే ఎస్సీ ఎస్టీ మానటారింగ్ సమావేశం నకు ఇలాగే అవమానం జరిగితే ఎస్సీ ఎస్టీ మార్నింగ్ సభ్యులు, దళిత నాయకులు,ఎమ్మార్పీఎస్ నాయకులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట అర్ధ నగ్న ప్రదర్శనతో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు.
Reporter
Namitha News