Monday, 14 September 2026 08:57:22 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్

Date : 01 March 2026 07:44 PM Views : 306

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 01 : తంబళ్లపల్లె నియోజకవర్గంలో 30 వేల జనసేన పార్టీ సభ్యత్వం చేపట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తంబళ్లపల్లెకు రప్పించడమే తమ లక్ష్యమని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై ఫోర్స్ మహేష్ , సద్ది కూటి హరినాథ్ తెలిపారు. ఆదివారం పాత జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో జనసేన సభ్యత్వ నమోదు కార్యకర్తల సమావేశం జరిగింది . ఈ సందర్భంగా మై ఫోర్స్ మహేష్, జనసేన నియోజకవర్గ నాయకుడు సద్దికూటి హరినాథ్ లను స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి తంబళ్లపల్లె పురవీధుల్లో జనసేన జిందాబాద్, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మై ఫోర్స్ మహేష్ మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా తంబళ్లపల్లెలో జనసేన ఆధ్వర్యంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టానని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త జనసేన క్రియాశీలక పార్టీ సభ్యత్వం చేపట్టాలని పిలుపునిచ్చారు. నీతి నిజాయితీ కి మారుపేరైన పవన్ కళ్యాణ్ ఆశయ సాధన తో తంబళ్లపల్లె నియోజకవర్గం లో అందరినీ కలుపుకొని జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీ అభివృద్ధి కోసం పోరాటం చేస్తానన్నారు. తంబళ్లపల్లెలో జనసేన కార్యకర్తలకు ఏ సమస్య వచ్చిన నా తమ్ముడు సద్దికూటి హరినాథ్ అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు. సద్దికూటి హరినాథ్ మాట్లాడుతూ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేయాలని నేడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడటానికి ప్రతి కార్యకర్త సమిష్టి కృషితో పనిచేయాలని కోరారు. సభ్యత్వ నమోదులో చొరవ చూపి రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో మహేష్ అన్న సహకారంతో జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు రాజారెడ్డి, ఎద్దుల నరసింహులు, ఆర్కె,రఘు, సురేష్, విజయ్ కుమార్ రెడ్డి, అరవింద్, రెడ్డప్ప, రెడ్డి ప్రసాద్, కార్తీక్, బిజెపి మండల అధ్యక్షుడు రమణ, మాజీ అధ్యక్షుడు రామస్వామి రెడ్డి, ఆరు మండలాల జనసేన మండల నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: