Wednesday, 29 July 2026 07:30:55 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ప్రకృతి పెరటి తోట పంట పండింది - పరవశించిన అధికారులు

మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ప్రశంసలు

Date : 27 February 2026 07:56 PM Views : 232

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 27 ః తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లో రెండు మాసాల క్రితం స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి ప్రయోగాత్మకంగా ప్రకృతి పెరటి తోట పెంపకం ప్రారంభించారు. ఆయన స్ఫూర్తితో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ ఎంఈఓ త్యాగరాజు సూచనలతో ప్రకృతి ఎరువులతో పెరటి తోట పెంపకం చేపట్టి సత్ఫలితం సాధించారు. శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి, కోసువారిపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సాదియాలు పెరటి తోటలోని పండిన పంటను చూసి పరవశించిపోయారు. తోటలో పండిన ముల్లంగి, ఆకుకూరలను పరిశీలించి మోడల్ స్కూల్ సిబ్బందిని ప్రశంసించారు. రసాయన ఎరువులతో పండిన పంటలతో ఆరోగ్యాలు క్షీణిస్తాయని మోడల్ స్కూల్ లో ప్రకృతి జీవన ఎరువులు తో పండించిన వ్యవసాయ పంట అందరికీ ఆదర్శంగా నిలిచినట్లు కొనియాడారు. మోడల్ స్కూల్ పెరటి తోట ఓ రోల్ మోడల్ గా నిలిచిందని వీరిని ఆదర్శంగా తీసుకొని పాఠశాలు, సచివాలయాలు, ఇంటి పెరడులు, రైతులు ప్రకృతి వ్యవసాయ పంటలపై దృష్టి సారిస్తే జిల్లాకే ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా వారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బందిని ప్రశంసించారు. వారి వెంట వైద్య సిబ్బంది, మోడల్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: