నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 24 : మదనపల్లి లో నివాసం ఉన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఇంటికీ మర్యాద పూర్వకంగా విచ్చేసిన నెట్టం వెంకటేష్. అనంతపురం డి.సి.యం.యస్. ఛైర్మన్ గా యున్న నెట్టం వెంకటేష్ ను ఇటీవల మదనపల్లి నియోజకవర్గం అబ్సర్వర్ గా నిమితులు కావడం తో మర్యాద పూర్వకంగా కలిసిన వెంకటేష్. ఈ సందర్బంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, టీడీపీ పార్టీ కమిటీలు, పార్టీ పనితీరు మరియు పార్టీ ని ఎలా సంస్థగతం గా బలోపేతం చేయాలో తదితరు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు గారు, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, పట్టణ అధ్యక్షులు నాదెళ్ల అరుణ్ (చింటూ), నిమ్మనపల్లె మండల సింగిల్ విండో చైర్మన్ రమణ, తెలుగు యువత అధ్యక్షులు ప్రణయ్ రాయల్, మల్లికార్జున, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News