నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జయసిందూర్ ఎంటర్టైన్మెంట్స్ 35 సంవత్సరాల ప్రయాణాన్ని ఘనంగా జరుపుకుంది మదనపల్లి, [30-11-2025]: మదనపల్లికి చెందిన ప్రముఖ సంగీత సంస్థ జయసిందూర్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ 25 లకశాల సుబ్స్చ్రిబెర్స్ తమ 35 సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానాన్ని ఈ ఆదివారం ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ స్థాపకులు శ్రీ సోప్పరం రాజేశ్వరరావు గారు మరియు ఆయన కుమారుడు హేమంత్ గారు తమ 35 ఏళ్ల సంగీత ప్రస్థానంలో కీలకమైన పాత్ర పోషించిన ప్రముఖ గీత రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులను సన్మానించారు. ఈ వేడుకలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ రాము, సింధు, గీత రచయితలు మద్దివేని శ్రీనివాసులు, సంగీత దర్శకులు కేఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తమ సంగీత యాత్రను మరింత విస్తరించి, భారతీయ సంగీత రంగంలో మరింత విజయాలను సాధించాలనే సంకల్పం వ్యక్తం చేశారు. ముందుండి అన్ని కళాకారులను ఆయా విభాగాల్లో సత్కరించారు. వారి చేతుల మీదుగా జరిగిన ఈ సన్మానం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా, జయసిందూర్ ఎంటర్టైన్మెంట్స్ మేనేజ్మెంట్ ప్రతినిధులు తమ సంగీత ప్రయాణంలో కీలకమైన పాత్ర పోషించిన ప్రముఖ గీత రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులను సన్మానించింది. ఈ సందర్భంగా, వారు తమ సంగీత యాత్రను మరింత విస్తరించి, భారతీయ సంగీత రంగంలో మరింత విజయాలను సాధించాలనే సంకల్పం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవంలో జయసిందూర్ ఎంటర్టైన్మెంట్స్ మేనేజ్మెంట్ ప్రతినిధులు అన్ని విభాగాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ 35 ఏళ్ల ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి కళాత్మక ప్రగతి కోసం తమ కృతజ్ఞతలను తెలిపారు. ఈ వేడుకలో ముఖ్యంగా గీత రచయితలు, సంగీత దర్శకులు, మరియు గాయనీ గాయకులు తమ కళా కృషితో ఈ సంస్థకు కొత్త ప్రాణం పోశారు. వారి పాటలు, స్వరాలు, బాణీలు, సంగీత నిర్మాణాలు ఈ సంస్థను ప్రేక్షకుల హృదయాల్లో విశేష స్థానం కల్పించాయి. ఈ సన్మాన కార్యక్రమంలో జయసిందూర్ ఎంటర్టైన్మెంట్స్ మేనేజ్మెంట్ తన 35 ఏళ్ల విజయవంతమైన ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Reporter
Namitha News