నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నేడే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం - ఆయుర్వేదాన్ని పాటించండి - సంపూర్ణ ఆరోగ్యంతో జీవించండి మదనపల్లి నవంబర్ 5, (మణి నమిత న్యూస్ ) సత్సంగ్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ యం జన్మదిన సందర్బంగా, మదనపల్లె మాజీ శాసనసభ్యులు నవాజ్ బాష ఆధ్వర్యంలో మదనపల్లి లో మొట్టమొదటిసారిగా కేరళ ఆయుర్వేద వైద్య రంగంలో 25 సంవత్సరాల అపారమైన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, మదనపల్లి పట్టణం లోని గాంధీరోడ్డు లో గల సిఎస్ఐ జెసిఎం ఫంక్షన్ హాలు నందు నిర్వహించడం జరుగు తుందని నిర్వాహకులు తెలిపారు. కావున ఈ సువర్ణ అవకాశాన్ని మదనపల్లె పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించు కోవాలని కోరారు. ఈ వైద్య శిబిరము నందు పాల్గొని, సనాతన ఆయుర్వేద వైద్యాన్ని వినియోగించు కోగలరని, ప్రజలను కోరారు. అలాగే మరిన్ని వివరములకు పవన్ - 9491076761, ఆరోగ్యం ఆఫీస్ : 8333981 305 సంప్రదించాలని కోరారు.
Reporter
Namitha News