నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఏప్రిల్ 10 : తంబళ్లపల్లె మండలం కుక్కరాజు పల్లిలో మైనార్టీ బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక టిడిపి సీనియర్ నేత మదనమోహన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. చెక్కులు పొందిన మైనార్టీ లబ్ధిదారులు మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేక అప్పులు చేసే వైద్యం చేయించుకున్న మాకు ముఖ్యమంత్రి సహాయ నిధి తో మైనార్టీలను అన్ని విధాల ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని భావోద్వేగంతో చెప్పారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు మస్తాన్, మైనార్టీ, కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News