Thursday, 30 July 2026 07:29:19 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఏపీఐఐసీ భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేస్తాం - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

భూ నిర్వాసిత రైతులతో సబ్ కలెక్టర్ సమావేశం

Date : 22 January 2026 08:42 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 22 ః మండలంలోని రెడ్డి కోట, కుక్క రాజు పల్లి ప్రాంతంలో ప్రభుత్వం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ఇప్పటికే 20 ఎకరాలు ప్రభుత్వ భూమి సేకరణ తో పాటు మరో 40ఎకరాలు రైతుల డికెటి భూములను ఎంపిక చేయడం జరిగిందని ఆ డీకేటి భూముల రైతులు అందరికీ న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి హామీ ఇచ్చారు. ఈ భూముల విషయమై గత రెండు నెలల క్రితం భూముల లబ్ధిదారులు రెడ్డి కోట వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టిన విషయం విధితమే. ఈ భూముల విషయమై గురువారం తాసిల్దార్ కార్యాలయంలో ఏపీఐఐసీ భూముల లబ్ధిదారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ మన ప్రాంతంలో ఏపీఐఐసీ లో భాగంగా ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించి అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు లబ్ధి చేకూరి తద్వారా భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రైతులు సమన్వయం పాటించి భూములు ఇవ్వడానికి సహకరించాలని కోరారు. మీ భూములకు ప్రభుత్వ పరంగా పరిహారం ఎంత ఇవ్వాలని వారిని కోరారు. ఈ సందర్భంగా కొందరు దళిత రైతులు మాకు మా పెద్దల నుండి సంక్రమించిన ఈ భూమి జీవనాధారమని ఈ భూములు పోతే ఎలా బతకాలని ఫిర్యాదు చేసి ససేమిరా అన్నారు. మన ప్రాంత అభివృద్ధి కోసం రైతులు త్యాగం చేయాలని వారికి సబ్ కలెక్టర్ సర్దిచెప్పినా వినకపోవడంతో మరోమారు రైతులు ఆలోచించుకొని సహకరించాలని ఇప్పటికే ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి సిద్ధపడిందని మీరు పెద్ద మనుసుతో ముందుకు రావాలని వచ్చే బుధవారం మరో మారు చివరి అవకాశం రైతులకు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తాశీల్దారు శ్రీనివాసులు, ఆర్ ఐ ముద్దుకృష్ణ, వీఆర్వోలు సంజీవ్, నాగరాజు రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: