నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 21 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో గురువారం కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. సాయంత్రం ఎన్నికల కమిటీ సభ్యులు డిడి అగర్వాల్, సునీల్ కుమార్ మీనా, సుప్రజ, జిల్లా ఇంచార్జ్ రెడ్డి విష్ణు ప్రియ లు మండల కేంద్రంలోని విశ్వనాధ వీధి, మెయిన్ బజార్ పలు వీధులలో ఇంటింటికి తిరిగి ఓటర్ల నమోదు ప్రక్రియ పై ఆరా తీశారు. పలు గృహాలు శిథిలమై వలసలు వెళ్లడం, కొందరు మృతి చెందిన గృహాలను పరిశీలించి పలు వివరాలను సేకరించారు. ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహణపై టీం లీడర్ తాసిల్దార్ శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల నమోదు పారదర్శకంగా నిర్వహించాలని వలసలు వెళ్లిన కుటుంబాలు ఎన్రోల్మెంట్ పై పూర్తి విచారణ చేసి నమోదు చేయాలన్నారు. ఓటర్ల నమోదు ఖచ్చితమైన సమాచారంతో ఎ న్యూమలేటర్లు ఓటరు నమోదు తో పాటు స్వీయ ఓటర్ నమోదు వేగవంతం చేయాలని సూచించారు. వారి వెంట ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమం డి ఎల్ డి ఓ లక్ష్మీపతి, సూపర్వైజర్లు ఎంపీడీవో ఎం వి ప్రసాద్, ఏపీవోఅంజనప్ప, డిప్యూటీ ఎంపీడీవో మారుతి కుమార్, ఆర్ ఐ ముద్దు కృష్ణ,ఏపిఎం గంగాధర్, కార్యదర్శులు శ్రీనివాసులు, హరి ప్రసాద్, ఏ న్యూమ లేటర్లు, వీఆర్ఏలు పాల్గొన్నారు
Reporter
Namitha News