నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 09 ః తంబళ్లపల్లె పంచాయతీ పరిధిలోని ఇట్నేని వారి పల్లె, జగనన్న లేఅవుట్ కాలనీవాసులకు పైప్ లైన్ ద్వారా తాగునీటి కష్టాలు తీరినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ ఈ వినోద్ కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం తంబళ్లపల్లె కోర్టు సమీపంలోని తాగునీటి బోరు మోటారు నుండి మండల అభివృద్ధి నిధుల నుండి ఇట్నేని వారిపల్లె వరకు పైపులైన్ ద్వారా జరుగుతున్న నీటి సరఫరా పనులను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై స్పందించిన ఏ ఈ వినోద్ కుమార్, ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, టిడిపి నాయకులు,మండల స్థాయి అధికారులు, కార్యదర్శి శ్రీనివాసరావులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News