నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 04 : రాయచోటి పట్టణం లోని మణికంఠ గిరి పై వెలసియున్న అయ్యప్ప స్వామి గుడి కి గురువారం రోజు మధ్యాహ్నం పట్టణంలోనే సుద్దలవానపల్లి రోడ్డు నందు గల మణికంఠగిరి అయ్యప్ప స్వామి మహాపూజ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని, గురుస్వాముల ఆహ్వానం మేరకు అయ్యప్ప స్వాములతో కలిసి బిక్ష చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ ధర్మంలో అయ్యప్ప మాల కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, చెడును మనలోనించి పారతోలేందుకు కఠినమైన మాల ధారణ ధరించి దీక్ష చేయడం గొప్ప విషయమన్నారు. మణికంఠ స్వామి దీక్ష ధరించిన వారు స్వామివారి దర్శనము అనంతరం తిరుగు ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా ఇండ్లకు చేరుకోవాలని ఆయన అయ్యప్ప స్వాములకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి రంజిత్ రాయల్ మరియు గురు స్వాములు పాల్గొన్నారు.
Reporter
Namitha News