Thursday, 30 July 2026 04:37:58 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫర్ లెర్నింగ్ ప్రోగ్రాం

ముఖ్య అతిధిలు గా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ సి.పి రవికుమార్, మలేషియా కు చెందిన డాక్టర్ రాష రజేబ్ అతల్లాహ్, జపాన్ కు

Date : 06 March 2026 10:19 PM Views : 214

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 06 : అంగళ్ళు సమీపం లో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఏఐసిటిఈ, న్యూఢిల్లీ వారి సహకారంతో రెండు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫర్ లెర్నింగ్ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బెంగళూర్ కు చెందిన టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ సి.పి రవికుమార్,మలేషియా దేశానికి చెందిన యూనివర్సిటీ అఫ్ మలయా, కంప్యూటర్ సిస్టం అండ్ టెక్నాలజీ విభాగం నందు పనిచేస్తున్న డాక్టర్ రాష రజేబ్ అతల్లాహ్, జపాన్ లోని ది యూనివర్సిటీ అఫ్ ఐజు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాగే ఉదయ్ కిరణ్, పోలాండ్ దేశానికి చెందిన యూ.బి.ఎస్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ ప్రోడక్ట్ మేనేజర్ ఈ ఆర్ రాంకుమార్ సెల్వరాజ్ మరియు లు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి.పి రవికుమార్ మాట్లాడుతూ మెషిన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్‌లో పని చేస్తున్న అకాడెమియా మరియు పరిశ్రమలకు చెందిన పరిశోధకులు, ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలను వారి అప్లికేషన్‌లను ఒకచోట చేర్చడానికి ఒక ప్రధాన అంతర్జాతీయ సమావేశం కు నాందిగా ఈ కార్యక్రమం ను ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. నేటి కంప్యూటింగ్ వ్యవస్థలు వేగంగా మరియు సమర్థవంతంగా పనిచేయడానికి ఆప్టిమైజేషన్ పద్ధతులు ఎంతో అవసరమని తెలిపారు. సెమీకండక్టర్ టెక్నాలజీ అభివృద్ధిలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రాసెసింగ్ వేగాన్ని పెంచడం, వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం వంటి అంశాల్లో ఆప్టిమైజేషన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కార్యక్రమం లో డాక్టర్ రాగే ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ సాంకేతిక రంగం లో ఉండే అనేక మంది పరిశోధకులు ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలు చేస్తున్నారని, మెషిన్ లెర్నింగ్ తో మొదలుకొని, డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో దిన దినాభివృద్ధి జరుగుతున్నాయని, టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు వెళుతున్నాం అని ఆయన అన్నారు. పరిశోధన పత్రాలు ప్రఖ్యాతి పొందిన ఐఈఈఈ లో ప్రచురణ చేయడం వారి కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఎంతో మంది పరిశోదలకులు వారి పరిశోధన పత్రాలు ఇక్కడ ప్రదర్శించడం, వారి ఆలోచనలను అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, కన్వీనర్ డాక్టర్ ఆర్ నిత్య, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: