Monday, 08 June 2026 09:57:17 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మిట్స్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫర్ లెర్నింగ్ ప్రోగ్రాం

ముఖ్య అతిధిలు గా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ సి.పి రవికుమార్, మలేషియా కు చెందిన డాక్టర్ రాష రజేబ్ అతల్లాహ్, జపాన్ కు

Date : 06 March 2026 10:19 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 06 : అంగళ్ళు సమీపం లో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఏఐసిటిఈ, న్యూఢిల్లీ వారి సహకారంతో రెండు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫర్ లెర్నింగ్ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బెంగళూర్ కు చెందిన టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ సి.పి రవికుమార్,మలేషియా దేశానికి చెందిన యూనివర్సిటీ అఫ్ మలయా, కంప్యూటర్ సిస్టం అండ్ టెక్నాలజీ విభాగం నందు పనిచేస్తున్న డాక్టర్ రాష రజేబ్ అతల్లాహ్, జపాన్ లోని ది యూనివర్సిటీ అఫ్ ఐజు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాగే ఉదయ్ కిరణ్, పోలాండ్ దేశానికి చెందిన యూ.బి.ఎస్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ ప్రోడక్ట్ మేనేజర్ ఈ ఆర్ రాంకుమార్ సెల్వరాజ్ మరియు లు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి.పి రవికుమార్ మాట్లాడుతూ మెషిన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్‌లో పని చేస్తున్న అకాడెమియా మరియు పరిశ్రమలకు చెందిన పరిశోధకులు, ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలను వారి అప్లికేషన్‌లను ఒకచోట చేర్చడానికి ఒక ప్రధాన అంతర్జాతీయ సమావేశం కు నాందిగా ఈ కార్యక్రమం ను ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. నేటి కంప్యూటింగ్ వ్యవస్థలు వేగంగా మరియు సమర్థవంతంగా పనిచేయడానికి ఆప్టిమైజేషన్ పద్ధతులు ఎంతో అవసరమని తెలిపారు. సెమీకండక్టర్ టెక్నాలజీ అభివృద్ధిలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రాసెసింగ్ వేగాన్ని పెంచడం, వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం వంటి అంశాల్లో ఆప్టిమైజేషన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కార్యక్రమం లో డాక్టర్ రాగే ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ సాంకేతిక రంగం లో ఉండే అనేక మంది పరిశోధకులు ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలు చేస్తున్నారని, మెషిన్ లెర్నింగ్ తో మొదలుకొని, డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో దిన దినాభివృద్ధి జరుగుతున్నాయని, టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు వెళుతున్నాం అని ఆయన అన్నారు. పరిశోధన పత్రాలు ప్రఖ్యాతి పొందిన ఐఈఈఈ లో ప్రచురణ చేయడం వారి కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఎంతో మంది పరిశోదలకులు వారి పరిశోధన పత్రాలు ఇక్కడ ప్రదర్శించడం, వారి ఆలోచనలను అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, కన్వీనర్ డాక్టర్ ఆర్ నిత్య, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :