నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 29 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎం.సి.ఏ విభాగం వారు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనే అంశంపై వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైలోని వి.ఐ.టి, వేలూరు లో స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగం నందు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ తనపాల్ .పి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఒక ఇంటర్నెట్ అప్లికేషన్లో ఫ్రంట్ఎండ్ యూజర్ చూసే భాగం మరియు బ్యాక్ఎండ్ లో డేటాబేస్, సర్వర్, లాజిక్ వంటి రంగాలలోనూ పనిచేయగల సాంకేతికత అని అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ నైపుణ్యానికి భారీ డిమాండ్ పెరగడం ద్వారా ఫుల్ స్టాక్ డెవలపర్లు ఫ్రంట్ఎండ్, బ్యాక్ఎండ్ రెండింటినీ నిర్వహించగలగడం వల్ల టీమ్పై ఆధారపడటం తగ్గి, ప్రాజెక్ట్ నిర్వహణ వేగంగా పెరుగుతోందని అన్నారు. విద్యార్థులకు ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్ అవగాహన ఉండటం వల్ల ఒక అప్లికేషన్ ఎలా రూపుదిద్దుకుంటుంది, డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది, యూజర్కు ఎలా కనిపిస్తుంది అన్నది పూర్తిగా అర్థమవుతుంది. ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రాజెక్ట్ మొత్తం అభివృద్ధి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ, ఒక్కరే ఒక టీమ్లా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకే ఐటి రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎన్.నవీన్ కుమార్, కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసన్ .జె, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News