నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధ్యాయులకు FLN శిక్షణ తరగతులు.. అన్నమయ్య జిల్లా,పుంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు నేడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకటవ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు FLN( ఫౌండేషన్ లి టరసి అండ్ న్యూమరసి ) శిక్షణా తరగతులను 04-06-2026 నుంచి 09-06-2026 తేదీ వరకు ఆరు రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఇందులో భాగంగా శిక్షణ తరగతులకు పుంగనూరు,చౌడేపల్లి,సోమల,సదుం మండలాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు అలాగే స్థానికంగా ఇతర మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించి మెరుగైన బోధనా పద్ధతుల గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని శిక్షణా కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారులు జి నటరాజ రెడ్డి తెలిపారు.కోర్స్ డైరెక్టర్ గా మండల విద్యాశాఖ అధికారి -2 రెడ్డన్న శెట్టి, వెన్యూ ఇంచార్జ్ గా ఉపాధ్యాయురాలు రుద్రాణి భాద్యత వహించారు.ఆయా మండలాల నుంచి ముగ్గురు జిల్లా రరిసోర్స్ పర్సన్స్ మొత్తం 12 మంది హాజరై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది.అలాగే నేడు బసవరాజ ప్రభుత్వం ఉన్నత పాఠశాల నందు పుంగనూరు మండలాలకు సంబంధించి కుక్ కం హెల్పర్ అయినా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు మెనూపై శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రెడ్డినశెట్టి మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈడిగపల్లి ప్రధానోపాధ్యాయురాలు రెడ్డమ్మ హాజరై మధ్యాహ్నం కార్మికులకు పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే జిల్లా రిసోర్స్ పర్సన్ శోభ గారు మధ్యాహ్న భోజనంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన మెనూ వంటగది నిర్వహణ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో కుక్ కం హెల్పర్స్ మరియు సీఆర్పీలు,పార్ట్ టైమ్ ఉపాధ్యాయులు హాజరయ్యారు.
Reporter
Namitha News