నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 03 : చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా దాడులు నిర్వహించిన నిమనపల్లి పోలీసులు.."PARKER 777"అనే యాప్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను నిమనపల్లి ఎస్సై కు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులు మహేందర్ సింగ్, ఎగేరి వినయ్ కృష్ణ సింగ్, కామిశెట్టి రెడ్డి ప్రసాద్, గంగాపురం సాయికుమార్, హేమంత్ లను పోలీసులు అరెస్టు చేసినట్లు.. ముఠాలో మిగిలిన ఏడుగురు పరారీలో ఉన్నట్లు మదనపల్లి డిఎస్పి పావని నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.... ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ యువతను ఆకర్షించి బెట్టింగుల ఊబిలోకి లాగుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. పట్టుబడ్డ నిందితులపై బిఎన్ఎస్ మరియు ఏపీ గేమింగ్ ఆక్ట్ కింద కేసులో నమోదుచేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మదనపల్లి డి.ఎస్.పి పావని తెలిపారు
Reporter
Namitha News