నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు, భారత దేశానికి సర్వత్రిక , ప్రజాస్వామ్య, గణతంత్ర హోదా కలిగేలా రాజ్యాన్ని అందించిన మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ దేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి అని వైయస్సార్ సిపి మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ కొనియాడారు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, గొల్లపల్లి సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అక్షరాస్యతతోనే దేశ పురోభివృద్ధితో పాటు, ఆర్థిక అసమానతలను తొలగించవచ్చునని నినదించి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశ ప్రజలంతా సమానత్వం కలిగి వుండాలని రాజ్యాంగం ద్వారా విధి,విధానాలు అందించిన గొప్ప వ్వక్తి అని కితాబునిచ్చారు. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగ మనమంతా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి మదనపల్లె నియోజకవర్గం సమన్వయకర్త ఎస్. నిస్సార్ అహమ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి. నరేష్ కుమార్ రెడ్డి, మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ మనుజా రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ పరిశీలకులు జింకా చలపతి, ఎస్ఈసి మెంబర్ షమీమ్ అస్లాం, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్.రెడ్డి, ప్రసాద్ బాబు, వెలుగు చంద్ర, ఈశ్వర నాయక్, సీనియర్ నాయకులు ఎల్ రఘునాథ రెడ్డి, ఎన్. మస్తాన్ ఖాన్, శీలం రమేష్, నరసింహులు, కొత్తపల్లి మహేష్, చంద్రశేఖర్, ఆవుల మల్లికార్జున, కమాల్ ఖాన్, సురేంద్ర, ఇర్ఫాన్, ఎస్రియాజ్, యూనస్, అబ్దుల్లా యాసిన్, నూరుల్లా, జబి, నవాజ్, మహేశ్, ఆవుల సోమశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, మజ్జిగ కేశవ యాదవ్, ఫయాజఖాన్ శంకర్ నాయక్, మాలెపాడు చలపతి , శ్రీనివాసులు, వడిగల శ్రీకాంత్ రెడ్డి, చరణ్, నజీర్, శారద రెడ్డి, నాగమణి, అపర్ణ, మేరీ, వినుతా బాయి, మంజుల, షారుఖ్, మహేష్ మరియు వివిధ మండలాల పార్టీ నాయకులు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News