నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - జూలై 19 : సదుం మండలం గొంగివారిపల్లి సమీపంలో ఆదివారం 11 కేవీ విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్కు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టిన పనుల్లో పాల్గొంటున్న పశ్చిమ బెంగాల్కు చెందిన తఫీజుల్లా (26) విద్యుత్ స్తంభంపై పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Reporter
Namitha News