Thursday, 16 April 2026 06:40:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

వైసిపి ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను చూపిస్తూ “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ ప్రచారం చేసుకున్న ‘క్రెడిట్‌ చోరుడు’ సిఎం చంద్రబాబునాయుడు అని మ

Date : 17 November 2025 06:41 PM Views : 98

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైసిపి ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను చూపిస్తూ “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ ప్రచారం చేసుకున్న ‘క్రెడిట్‌ చోరుడు’ సిఎం చంద్రబాబునాయుడు అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పేర్కొన్నారు.‌ మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలంలోని నడిమిపల్లి, చెంబకురు, కాప్పాల్లి, ఏలగపల్లి, కమ్మవారిపల్లి, నారిగానిపల్లి కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదని, ఒక్క సెంటు స్థలం కూడా ఎవరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇళ్ళ నిర్మాణానికి ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదని, ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను చూపిస్తూ “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ ప్రచారం చేసుకున్న ‘క్రెడిట్‌ చోరుడు’ సిఎం చంద్రబాబునాయుడు అని పేర్కొన్నారు. తాము ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదన్నారు. ఆ 3,00,092 ఇళ్లలో వైసిపి హయాంలోనే సుమారు 1 లక్ష 50 పూర్తయ్యే దశలో ఉన్నవేనని పేర్కొన్నారు. మరో 87 వేలకు పైబడి ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకూ గత ప్రభుత్వ హాయాంలోనే కట్టించినవేనని తెలిపారు. ఇవికాక అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో గత ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా అసలు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, అన్నీ కూటమి ప్రభుత్వమే చేసినట్టుగా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు క్రెడిట్‌ చోరుడు అన్నారు. మదనపల్లె కేంద్రంగా జరిగిన కిడ్ని రాకెట్ పైన సిట్, సిఐడి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున కిడ్ని రాకెట్ పట్టుబడి, దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తే చర్యలు మాత్రం శూన్యం అన్నారు. మెడికల్ కాలేజీల పిపిపి విధానాన్ని వెంటానే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గ వైసిపి పరిశీలకులు అనూషారెడ్డి, కేశవరెడ్డి, రమణారెడ్డి, CH. రామచంద్రారెడ్డి, గెవెన్న, దర్శన్ గౌడ్, V.S.రెడ్డి, ఇర్ఫాన్ షేక్, కృష్ణారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రెడ్డి వీరై గౌడ్, తిప్ప రాజు, చంద్ర, జింకల శ్రీనివాసులు, గంగాధర, చరణ్, నర్సింహా రెడ్డి, రాధాకృష్ణ రెడ్డి, నాగప్ప, మహేష్, నాగమణి, పద్మారెడ్డి, ఫయాజ్ ఖాన్, చలపతి, జబివుల్లా తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :