నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 29 : రామసముద్రం మండల కేంద్రంలోని శ్రీవారి భక్తులు దాదాపు 900 మంది భక్తులు గందోడి పూల అంజప్ప ఆధ్వర్యంలో సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం నందు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చెక్ పోస్టు కూడలి లోని గ్రామ దేవత గంగమ్మకు పూజలు నిర్వహించి అనంతరం ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు. పాదయాత్ర గా వెళ్లే భక్తులకి మూడు పూటలా భోజన సౌకర్యం ఏర్పాటు చేసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పాదయాత్ర ని చేపట్టుతున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు టీటీడీ లక్కీ డ్రిప్పు ఆన్లైన్ ద్వారా టికెట్లను ఈ సంవత్సరం భక్తులకు జారీ చేసింది. వీరికి ఎవరికీ టికెట్లు లేకపోవడంతో 2వ తేదీ నుంచి సామాన్య భక్తుల సర్వదర్శనం కోసం శ్రీవారి భక్తులు బయలుదేరారు. భక్తి పాటలతో కోలాటం చెక్కభజనలుతో ఆడతూ పాడుతూ పాదయాత్ర ఎలాంటి అలుపు సోలుపు లేకుండా భక్తి భావంతో వెళ్తున్నారు. రామసముద్రం లో గోవింద నామస్మరణలతో మారమోగింది. ఈ కార్యక్రమంలో గందోడి పూల అంజప్ప, శ్యామప్ప, వెంకటేష్, జనార్ధన్, కుమార్, ఆనంద, నారి, వెంకటరమణ,విజయ్ కుమార్, డ్రైవర్ సీనప్ప, శ్రీవారి భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News