Sunday, 13 September 2026 07:40:07 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మాజీ మంత్రి రోజా సైతం SIR ప్రక్రియ లో

వేలావడి పోలింగ్ బూత్‌లలో SIR ప్రక్రియను సమీక్షించిన మాజీ మంత్రి ఆర్.కె రోజా సెల్వమణి

Date : 24 June 2026 07:47 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నగిరి - జూన్ 24 : నగరి రూరల్ మండలం వేలావడి గ్రామ పరిధిలోని 153, 154 పోలింగ్ బూత్‌లలో SIR ప్రక్రియకు సంబంధించిన సమస్యలు, స్థానిక పరిస్థితులు మరియు ఓటర్ల సందేహాలపై మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి ఆర్.కె. రోజా గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్టీ BLAలు, మండల అబ్జర్వర్, టీం కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బూత్‌ల వారీగా SIR ప్రక్రియ ప్రగతి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు, అవసరమైన పత్రాల వివరాలపై రోజా గారు BLAలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి సందేహాలు, సమస్యలను తెలుసుకున్నారు. SIR దరఖాస్తులను ఏ విధంగా నింపాలి, అవసరమైన వివరాలు, పత్రాలు ఏమిటి, దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని ఎలా సరిచేయాలి అనే అంశాలపై ఓటర్లకు, BLAలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. మన పార్టీకి సంబంధించిన ఓటర్లను గుర్తించి, ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ మంత్రి ఆర్.కె. రోజా గారు స్పష్టం చేశారు. SIR దరఖాస్తులలో ఎటువంటి తప్పులు లేకుండా అవసరమైన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి సరిచేసుకోవాలని సూచించారు. అనంతరం సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ద్వారా దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయించాలని BLAలు, నాయకులు మరియు కార్యకర్తలకు ఆమె వివరంగా దిశానిర్దేశం చేశారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు SIR ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మరియు సహాయం అవసరమైన ఓటర్లకు ప్రత్యేకంగా సహకారం అందించాలని ఆమె సూచించారు. బూత్‌ల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సమాచారం అందిస్తూ, ఎవరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా చూడాలని BLAలకు సూచించారు. అలాగే ఓటర్ల నుంచి వచ్చే ప్రతి సమస్యను నమోదు చేసి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అబ్జర్వర్, టీం కమిటీ సభ్యులు, BLAలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: