Monday, 14 September 2026 08:42:19 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ముస్లింలకు చట్ట సభల్లో అవకాశాలు, రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాడుదాం - జాఫర్ పులి

డిసెంబర్ 1 నుండి పాదయాత్ర

Date : 24 November 2025 07:14 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 23 : ముస్లిం ఐక్యవేదిక విద్య ఉపాధి ఆరోగ్యం మహిళా సాధికారత, సామాజిక అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి స్పష్టం చేశారు. ఆదివారం మదనపల్లి పట్టణం లో అన్నమయ్య మరియు కడప జిల్లాల ముస్లిం ఐక్యవేదిక గౌరవ సలహా దారులు డాక్టర్ ఎస్ కే భాష ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి హాజరై జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేసి కొంతమందికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా ముస్లింలను ఓటు బ్యాంకు గానే వాడుకుని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ముస్లిం లకు అభివృద్ధిలో వాటా లేదని, సంక్షేమంలో సమానత్వం ఉండదని ముస్లింల ను పాతాళంలోకి నెట్టివేయ బడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ముస్లిం ల ఐక్యవేదిక సంపూర్ణ హక్కుల సాధన కోసం, జాతిని మేల్కొల్పే విధంగా చైతన్య పరచుతోందని గుర్తు చేశారు. ముస్లింల సంపూర్ణ సామాజిక అభివృద్ధి సాధించే దిశగా, ఐక్యవేదిక ప్రత్యేక ప్రణాళికలతో పని చేస్తూ జాతిని జాగృతం చేయడానికి ముందుకు సాగుతుందని చెప్పారు. గడిచిన ఐదేళ్ల కు పైగా ముస్లింల సామాజిక హక్కుల సాధన కోసం ముస్లింల ఐక్యవేదిక రాజీలేని పోరాటం కొనసాగిస్తోందన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి ముస్లిం ఐక్యవేదిక బలమైన శక్తిగా నిలబడిందన్నారు. రానున్న రోజుల్లో ముస్లింల సామాజిక అభివృద్ధి కోసం మరింత దూకుడుగా ముందుకు సాగడంతో పాటు హక్కుల కోసం పోరాడేందుకు ముందు ఉంటామన్నారు. ఈ క్రమంలోనే మదనపల్లె లో మదనపల్లి తో పాటు అన్నమయ్య జిల్లాలోను కమిటీలు వేయడం జరిగిందని తెలిపారు. ముస్లింలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించడం రాజకీయ రిజర్వేషన్ల కోసం డిసెంబర్ ఒకటో తారీఖున నంద్యాల నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టామని ప్రకటించారు. మనకోసం మన అభివృద్ధి కోసం ఈ కార్యక్రమంలో ముస్లింలంతా భాగస్వాములై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. అన్నమయ్య కడప జిల్లాల గౌరవ సలహాదారులు డాక్టర్ ఎస్ కే భాష మాట్లాడుతూ ముస్లిం ఐక్యవేదిక ద్వారా జాతిని మేల్కొల్పుతూ అభివృద్ధి చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉర్దూ భాషను అధికార భాషగా గుర్తించి ప్రభుత్వ కార్యాలయాలు మరియు వ్యవహారాల్లో వినియో గించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముస్లిం విద్యాభ్యాసంలో వెనుకబడి ఉండటం చేత సమాజంలో ఇప్పటికీ ముందుకు సాగలేక పోతున్నారని, ఈ విషయంలో జాతిని చైతన్య పరచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో ముస్లింలకు జనాభా ధమాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ముస్లింలలోని అన్ని వర్గాలు ఐక్యంగా న్యాయమైన హక్కుల సాధన కోసం కలిసి ముందుకు సాగుదాం అని పిలుపు నిచ్చారు. పలువురు ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ పిల్లలు విద్యా భ్యాసంలో వెనుకబడి ఉన్నారని వారిని మేల్కొల్పి అందరూ చదువుకునే విధంగా ప్రోత్సహించే ముందుకు తీసుకు వెళ్ళగలిగితే అన్ని రంగాలలోనూ ముస్లింలు ముందు ఉంటారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మదనపల్లి పట్టణ అధ్యక్షులు ఏ బావాజీ, పట్టణ కార్యదర్శి సోహెల్, పట్టణ జాయింట్ సెక్రటరీ ఎస్ బావ జాన్, మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఖాదర్ బాషా, కురబలకోట మండల అధ్యక్షులు ముబారక్ సాహెబ్, రామసముద్రం మండల అధ్యక్షులు ముబారక్, పీలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సమృద్దీన్, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు పఠాన్ ముబారక్ లు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: