నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 03 : మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పది మంది లబ్దిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వారి ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులకు అందచేసిన ఎమ్మెల్యే. వారి కుటుంబ సభ్యులతో మమేకమై ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. నేడు పది మంది లబ్దిదారులకు కలిపి రూ 10,50,000/- రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఈ సందర్భంగా వారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ యం. షాజహాన్ భాషా గారికి జీవితాంతం రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేయడమైనది..!
Reporter
Namitha News