నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు , యువతలో శారీరక దృఢత్వం, ఆత్మస్థైర్యం నింపుట, క్రీడల్లో నైపుణ్యం సాధించాటానికి ప్రతిష్టత్మాకంగా అమలుచేస్తున్న చేస్తున్న సమ్మర్ క్యాంప్ లకు అన్నమయ్య జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో జిల్లాలోనే 1,500 మందికి పైగా నమోదు కావడం, జిల్లాలో 50 సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయం అంటూ నిర్వహకులకు క్రీడా సామాగ్రి ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ యువత క్రీడలలో కూడా రాణించాలని , రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సమ్మర్ కోచింగ్ క్యాంపుల ద్వారా క్రీడాకారులు ప్రతిభను మెరుగుపరుచుకుని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారులలో వారి నైపుణ్యాలను గుర్తించి అ దిశగా ప్రోత్సాహ పరిచి వారి నైపుణ్యాన్ని చాటే విదంగా తీర్చి దిద్దాలని కోచ్ లకు సూచించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ సమ్మర్ కోచింగ్ ద్వారా పిల్లలకు ఉచితంగా క్రీడా పరికరాలు అందజేస్తున్నాం, మొబైల్, టీవీలకు పరిమితం కాకుండా యువత శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునేలా ఉదయం, సాయంత్రం క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. క్రికెట్, ఫుట్బాల్, హాకీ, జావెలిన్ త్రో తదితర క్రీడలకు అవసరమైన ఫిట్నెస్ సామగ్రిని ఉపయోగించుకొని క్రీడ ల్లో రానించాలని సూచించారు
Reporter
Namitha News