Monday, 14 September 2026 06:53:11 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నృత్య,గాన సృజనాత్మకతను వెలికితీయడమే తమ లక్ష్యం - థిల్లానా కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకులు వెంకటేష్ స్పష్టం

Date : 03 April 2026 05:44 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నృత్య,గాన సృజనాత్మకతను వెలికితీయడమే తమ లక్ష్యం - థిల్లానా కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకులు వెంకటేష్ స్పష్టం - ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు - హాజరైన ట్రాఫిక్ సిఐ గురునాథ్,కలికిరి సీఐ అనిల్ కుమార్ మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె నందు థిల్లానా సాంస్కృతిక సంస్థ టాలెంట్ ఎక్స్పో పేరుతో డాన్స్,పెయింటింగ్,సింగింగ్ విభాగాలలో జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలను నిర్వహించింది.దీనికి పిల్లల నుండి మంచి స్పందన లభించింది.శుక్రవారం స్థానిక సొసైటీ కాలనీలో శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ నందు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మదనపల్లె ట్రాఫిక్ సిఐ గురునాథ్,కలికిరి సిఐ అనిల్ కుమార్,హెడ్ కానిస్టేబుల్,ప్రముఖ వ్యాఖ్యాత రామ్మూర్తి,థిల్లానా కల్చరల్ సొసైటీ ఫౌండర్ వెంకటేష్,ఉపాధ్యాయుడు బి.వి రమణ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్తమాన కాలంలో పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడివారిలో వున్న ప్రతిభను మరచితున్నారని గుర్తుచేశారు.వాటి నుండి వారిని దూరం చేయాలనే సదుద్దేశ్యంతో నిర్వహించిన థిల్లానా టాలెంట్ ఎక్స్పోలో పాల్గొని ప్రతిభను చాటి చెప్పిన పిల్లలను అభినందించారు.చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.చిన్నతనం నుండే దేశభక్తి సామాజిక స్పృహను,పెంపొందించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.గుడ్ విల్ కంప్యూటర్స్ వేదికగా థిల్లానా వ్యవస్థాపకుడు వెంకటేష్ ను ప్రసంశించారు.పిల్లలంతా చదువుతో పాటు కలలు,క్రీడలపైన ఆసక్తిని పెంచుకొని రాణించాలని సూచించారు.థిల్లానా కార్య నిర్వాహకులు నాగరాజ్,సురేష్,దిలీప్,జస్వంత్ లు మాట్లాడుతూ థిల్లానా టాలెంట్ ఎక్స్ పోలో మదనపల్లె,గాలివీడు,నూలివీడు,పుంగనూరు ప్రాంతాల నుండి విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.పిల్లలలో దాగి వున్న ప్రతిభను వెలికితీయడంలో అవకాశాలు కల్పించడంలో థిల్లానా ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు.అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు,సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహానికి తనవంతు సహకారం అందిస్తున్న శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత విజయ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం ముఖ్య అతిథులు చేతుల మీదుగా విజేతలకు ప్రథమ,ద్వితీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు,శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :