Thursday, 30 July 2026 12:36:01 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పాడి ఆవులు ఇతర రాష్ట్రాల నుండి తెచ్చుకోవాలి - ఏడి సుమిత్ర

Date : 25 May 2026 09:55 PM Views : 80

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 25 : మహిళా సంఘాలు బ్యాంకు లింకేజి,శ్రీనిధి ద్వారా రుణాలుగా పొందే పాడి ఆవులు ఇకపై ఇతర రాష్ట్రాలు, లేదా ఇతర జిల్లాల నుండి తెచ్చుకోవాలని పశుసంవర్ధక శాఖ ఏడి సుమిత్ర సూచించారు. సోమవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఏడి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో పాడి పరిశ్రమ తో పాటు పాల దిగుబడి పెంపుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదేవిధంగా ప్రతి పశువుకు పాడి రైతు నష్టపోకుండా తప్పక భీమా చేయించుకోవాలన్నారు. రుణాలు పొందిన మహిళా సంఘాలు పాడి ఆవులు, గొర్రెలు యూనిట్లకు బీమా చేసుకోవాలన్నారు. ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ మండలంలో ఇప్పటివరకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి ద్వారా 430 పాడియావులు యూనిట్లు, గొర్రెలు 80 యూనిట్లు రుణాలకు ఎంపిక చేసినట్లు చెప్పారు. పాడి ఆవులు, గొర్రెలు యూనిట్లకు బీమా చేసుకుంటే భవిష్యత్తులో మహిళా రైతుల నష్టపోకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందన్నారు. శ్రీనిధి మేనేజర్ అమరావతి మాట్లాడుతూ శ్రీనిధి ద్వారా రుణాలు పొందిన మహిళలు పాడి పరిశ్రమ అభివృద్ధితోపాటు బీమా సౌకర్యం తో భవిష్యత్తులో ఆర్థికంగా నష్టపోకుండా ఆర్థికంగా బలపడాలన్నారు. మండల పశువైద్యాధికారి విక్రం రెడ్డి పాడి ఆవులు, గొర్రెలు కొనకం, బీమా సౌకర్యంపై పలు సూచనలు, సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలోఎమ్మెస్ ప్రెసిడెంట్ రామలక్ష్మమ్మ, సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి మహిళా సంఘాలు, సంఘ మిత్రలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :