నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 25 : మహిళా సంఘాలు బ్యాంకు లింకేజి,శ్రీనిధి ద్వారా రుణాలుగా పొందే పాడి ఆవులు ఇకపై ఇతర రాష్ట్రాలు, లేదా ఇతర జిల్లాల నుండి తెచ్చుకోవాలని పశుసంవర్ధక శాఖ ఏడి సుమిత్ర సూచించారు. సోమవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఏడి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో పాడి పరిశ్రమ తో పాటు పాల దిగుబడి పెంపుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదేవిధంగా ప్రతి పశువుకు పాడి రైతు నష్టపోకుండా తప్పక భీమా చేయించుకోవాలన్నారు. రుణాలు పొందిన మహిళా సంఘాలు పాడి ఆవులు, గొర్రెలు యూనిట్లకు బీమా చేసుకోవాలన్నారు. ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ మండలంలో ఇప్పటివరకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి ద్వారా 430 పాడియావులు యూనిట్లు, గొర్రెలు 80 యూనిట్లు రుణాలకు ఎంపిక చేసినట్లు చెప్పారు. పాడి ఆవులు, గొర్రెలు యూనిట్లకు బీమా చేసుకుంటే భవిష్యత్తులో మహిళా రైతుల నష్టపోకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందన్నారు. శ్రీనిధి మేనేజర్ అమరావతి మాట్లాడుతూ శ్రీనిధి ద్వారా రుణాలు పొందిన మహిళలు పాడి పరిశ్రమ అభివృద్ధితోపాటు బీమా సౌకర్యం తో భవిష్యత్తులో ఆర్థికంగా నష్టపోకుండా ఆర్థికంగా బలపడాలన్నారు. మండల పశువైద్యాధికారి విక్రం రెడ్డి పాడి ఆవులు, గొర్రెలు కొనకం, బీమా సౌకర్యంపై పలు సూచనలు, సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలోఎమ్మెస్ ప్రెసిడెంట్ రామలక్ష్మమ్మ, సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి మహిళా సంఘాలు, సంఘ మిత్రలు పాల్గొన్నారు
Reporter
Namitha News