నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు మదనపల్లె : రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ప్రజా శ్రేయస్సుకై పరితపించే నాయకుడని వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా పేర్కొన్నారు.శుక్రవారం ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మదనపల్లె పట్టణం,14వ వార్డులో ఇరిగేషన్ కార్పొరేషన్ మాజీ స్టేట్ డైరెక్టర్ దండాల రవిచంద్రా రెడ్డి,పార్టీ శ్రేణులు సమక్షంలో అట్టహాసంగా జరిగాయి.ఇందులో భాగంగా ఎస్.ఏ కరీముల్లా సమక్షంలో కేక్ కట్ చేసి అభిమాన నాయకుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తిరుపతిలోని ఎంపీ నివాసానికి వెళ్లి ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్.ఏ కరీముల్లా మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో పెద్దిరెడ్డి కుటుంబం ఎల్లవేళలా ముందుంటుందన్నారు.తన తండ్రి,మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నుండి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొన్న మిథున్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించారని,అనతి కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారన్నారు.మూడు పర్యాయాలు ఎంపీగా ఎన్నికై ప్రజాసేవకు పునరంకితమయ్యారని,రాజంపేట పార్లమెంట్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు.మదనపల్లె మెడికల్ కళాశాల,పీలేరు - మదనపల్లె నాలుగు వరుసల రహదారి నిర్మాణం,కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటులో ఆయన పాత్ర క్రియాశీలకమన్నారు.మాజీ సీఎం,వైకాపా అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలలో సహాయ,సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని ప్రశంసించారు.వైకాపా కార్యకర్తల శ్రేయస్సు,పార్టీ అభ్యున్నతికి నిర్విరామ కృషిచేస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు షేక్ షబానా,ముబీనా,అస్మత్ జాన్,గట్టు సురేష్,సురేంద్ర నాథ్,కిశోర్ కుమార్ రెడ్డి,నాగిరెడ్డి,రఫీ,తాజ్ బాషా,రమాదేవి,పెద్దఎత్తున వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News